Prakash Raj: జస్ట్ ఆస్కింగ్ అంటున్న ప్రకాష్ రాజ్ !

ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్’’ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.


Published Sep 27, 2024 01:54:00 PM
postImages/2024-09-27/1727425609_f6c1bdcbcb03064837e53ad285aa697d1702654367591488original.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్న ఆరోపణలపై ప్రకాశ్  రాజ్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య ఓ హాట్ ట్రాక్ నడుస్తుంది. అయితే ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ తో టాపిక్ లో హీట్ పెంచారు. ఆయన ట్వీట్లపై విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ వెనక్కి తగ్గడంలేదు. అసలు ఫస్ట్ ట్వీట్ అంతా ఎందుకు ఇంత రచ్చ అని అడిగినా ..తర్వాత తప్పుగా అర్ధం చేసుకోకండి నేను నేపాల్ లో ఉన్నా ...పని అయ్యాక ఇండియా వచ్చి చెప్తా నంటు ట్విట్ వేశారు.


ఇప్పుడు మరో ట్విట్ తో ...ఆయన మరోసారి జస్ట్ ఆస్కింగ్ అంటూ ఇంకో ట్వీట్ చేశారు. ‘‘మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన, అవసరమైతే తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? జస్ట్ ఆస్కింగ్’’ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు.


పవన్ తిరుమల లడ్డు పై పవన్ కళ్యాణ్ పెద్ద రచ్చ చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ టాక్.  పబ్లిక్ చాలా డిస్టర్బ్ అవుతున్నారనే విషయాన్ని చాలా సామరస్యంగా హ్యాండిల్ చెయ్యాలి. అంతే కాని ఇలా రచ్చరచ్చ  చెయ్యకూడదనేది ప్రకాశ్ అభిప్రాయం అనేవారు లేకపోలేరు.

newsline-whatsapp-channel
Tags : pawan-kalyan ttd tirumala-laddu prakash-raj

Related Articles