Uttar Pradesh: డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన డెడ్ బాడీ ! షాక్ అయిన మెనేజర్ !

ఓ ముసలావిడ చాలా ఏళ్లుగా తన అకౌంట్ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది. అది తన చివరి రోజుల్లో అవసరం అవుతాయనో ..ఏదో పనికి వేసుకుంది. కాని ఆ విషయం తెలుసుకున్న అల్లుడు వేరే స్కెచ్ వేసుకున్నాడు.


Published Sep 27, 2024 10:00:00 PM
postImages/2024-09-27/1727454729_bribe1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : ఏదో సినిమా లో చూసినట్లు ఉంది. అసలు డెడ్ బాడీ ..డబ్బులు ఎలా రిలీజ్ చేసుకుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. నిజానికి డబ్బు చేసే మాయ ఇదే. ఓ ముసలావిడ చాలా ఏళ్లుగా తన అకౌంట్ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంది. అది తన చివరి రోజుల్లో అవసరం అవుతాయనో ..ఏదో పనికి వేసుకుంది. కాని ఆ విషయం తెలుసుకున్న అల్లుడు వేరే స్కెచ్ వేసుకున్నాడు.


ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వృధ్ధురాలికి చాలా రోజులుగా ఆరోగ్యం బాలేదు. హాస్పిటిల్ లో ఉంది. డబ్బు ముందే తీసేసుకుంటే అయిపోతుందని భావించిన అల్లుడు ..హాస్పటిల్ నుంచి బయటకు కారులో తీసుకువచ్చి బ్యాంకుకు తీసుకొని వచ్చాడు. కస్టమర్ కు ఆరోగ్యం బాలేదని అర్జెంట్ గా తన అకౌంట్ లో డబ్బు కావాలని ...చెప్పాడు. 


తన మాటలు నమ్మి మేనేజర్ కూడా ఆవిడను చూడడానికి బయటకు వెళ్లాడు. కారులో  కూర్చున్న ఆమెను చూసి షాకయిపోయాడు. కదలకుండా అలా ఉన్నమహిళను చూసి పల్స్ చెక్ చేయగా ఆవిడ చనిపోయింది. డబ్బు ఇవ్వడం కుదరదని చెప్పాను . దానికి మృతిరాలి  బంధువులు పెద్ద రచ్చ చేశారు. డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి అప్పడుకే ఇదంతా సాధ్యమవుతుందని తెలిపినందుకు మేనేజర్ ను కొట్టడానికి వచ్చారని పోలీసులకు తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news uttarpradesh money

Related Articles