video: మల్లారెడ్డి మాట్లాడుతుండగా కరెంటు కట్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా పవర్ కట్ అయింది. దాదాపు 30 నిమిషాల పాటు కరెంటు రాలేదు.

Update: 2024-04-27 10:16 GMT

న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)లో ప్రజలకు, BRS నాయకులకు కరెంటు తీప్పలు తప్పడం లేదు. ఈరోజు ఎమ్మెల్యే మల్లారెడ్డి(Mallareddy) మల్కాజ్‌గిరి పార్లమెంట్ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో(Parliament elections) కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా పవర్ కట్ అయింది. దాదాపు 30 నిమిషాల పాటు కరెంటు రాలేదు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా అరుపులు, కేకలు పెట్టారు. 'కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది' అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజంలో కరెంటు కోతలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.



Tags:    

Similar News