KTR: ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ ఆపద మొక్కులు

బీఆర్ఎస్ పార్టీ (brs party) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (ktr) శనివారం హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్‌లో (telangana bhavan) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

KTR: ఎన్నికల్లో గెలిచేందుకు రేవంత్ ఆపద మొక్కులు
X

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ (brs party) వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (ktr) శనివారం హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్‌లో (telangana bhavan) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy) తన సొంత జిల్లాలో గెలవడం కూడా కష్టమే అని ఎద్దేవ చేశారు. తాను ఇంఛార్జ్‌గా ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని సీఎం బాధ్యతలు నుంచి తప్పుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులవి (congress party leaders) అన్ని చిల్లర, ఉద్దెర మాటలు. రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి మోసపోయామని అర్థమైంది. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోసం పార్ట్ – 1 రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం మోసం పార్ట్ -2 మొదలు పెట్టిండు. దేవుళ్ళ సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుండు. ఆగస్ట్ 15వ తేదీ లోపు రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు.. కొడంగల్‌లో (kodangal) ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో (GHMC elections) కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత సీఎం మాట తప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు మొక్కుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది సచ్చేది లేదు. అందుకే దేవుడి పైన ఒట్లు పెడుతూ సీఎం ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు? మోడీ నాయకత్వంలోనా? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా? అని ఆయన ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీ (bjp) కండువా కప్పుకుంటారని కేటీఆర్ అన్నారు. నేను ఈ మాట ఇప్పటికే 20 సార్లు చెప్పిన సరే ఆయన కనీసం ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. కనీసం ఇప్పటికైన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం హామీలు అమలు చేయట్లేదని.. దానిపై స్పందించాలి అని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే హరీష్ రావు సవాల్‌కు స్పందించాలన్నారు. రేవంత్ రెడ్డి మోసం పార్ట్-2 ఇది.. ఎట్టి పరిస్థితుల్లో ఆయన రుణమాఫీ చేయడు. నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే సీఎం మాటల్లో నిజాయితీ ఉండదు. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్ రెడ్డి కట్టుబడి లేడు. ఆయన ఏ సవాలుకి కట్టుబడి ఉన్నాడో చెప్పాలె? గతంలో కొడంగల్‌లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిసారి రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆయన విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్‌లో (ap) కూడా ప్రాంతీయ పార్టీనే గెలవాలని కోరుకుంటున్న అని కేటీఆర్ అన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే గెలిచే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మాకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి (jagan mohan reddy) గెలుస్తారు. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (medchal mla mallareddy) రాజకీయ అనుభవం వ్యూహంతోనే ఆ కామెంట్ చేశారు. ఈటెల రాజేందర్‌ని (etela rajender) మునగ చెట్టు ఎక్కిచ్చి తన రాజకీయ అనుభవాన్ని చాటుకున్నారు. మల్కాజ్‌గిరిలో ఖచ్చితంగా గెలిచేది బీఆర్ఎస్సే.. అది ఈటల రాజేందర్‌కి కూడా తెలుసు. మల్లారెడ్డి అన్న మాట అంతరార్థం తెల్వక కొంతమంది ఆగమవుతున్నారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయిన సరే.. శ్రేణులు అంతా వెళ్లడం అసాధ్యం. బీఆర్ఎస్‌లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలి. పార్టీ మారిన కేకే (kk), రంజిత్ రెడ్డి (ranjith reddy) పరిస్థితి ఎలా ఉందో అందరికి తెలుసు అని కేటీఆర్ అన్నారు.”

Tags:
Next Story
Share it