AP: గ్రూప్-1 పరీక్ష రద్దు
2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ను ఏపీ హైకోర్ట్ రద్దు చేసింది. మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది.
న్యూస్ లైన్, కెరీర్: గ్రూప్-1పై హై కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. 2018లో ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ను ఏపీ హైకోర్ట్ రద్దు చేసింది. మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్పై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రశ్నపత్రాలను పలుసార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. పరీక్షను మరోసారి నిర్వహించాలని ప్రభుత్వాని ఆదేశించింది. 6 వారాల్లో మెయిన్స్ పరీక్షను తిరిగి నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియ పూర్తిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Tags:
Next Story