AP: నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి- లక్ష్మీనారాయణ

తనకు ప్రాణహాని ఉందని జై భారత్ నేషనల్ పార్టీ (jai bharath national party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD lakshmi narayana) విశాఖపట్నం (vishakapatnam) సీపీ రవి శంకర్‌(ravi Shankar)కి ఫిర్యాదు చేశారు.

AP: నాకు ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి- లక్ష్మీనారాయణ
X

న్యూస్ లైన్ డెస్క్: తనకు ప్రాణహాని ఉందని జై భారత్ నేషనల్ పార్టీ (jai bharath national party) అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD lakshmi narayana) విశాఖపట్నం (vishakapatnam) సీపీ రవి శంకర్‌(ravi Shankar)కి ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహానీ ఉందని, రక్షణ కల్పించాలని ఆయన సీపీని కోరారు. తాను సీబీఐలో ఉన్నప్పుడు దేశాన్ని కుదిపేసిన ఎన్నో కేసులను చూశానన్నారు. ఆ సమయంలోనే చాలా బెదిరింపులు వచ్చాయన్నారు. 2018 తర్వాత సీబీఐ నుంచి బయటకు వచ్చేశాను. కొంతమంది పాత కేసుల నిందితుల శిష్యులు నాపై కక్ష కట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. అప్పుడు తమ లీడర్‌కు శిక్ష పడేలా చేశానని పగబట్టారు. ఇది అంతా తేలికగా తీసుకునే విషయం కాదని సిపీకి ఫిర్యాధు చేశానని ఆయన తెలిపారు.

జేడీ లక్ష్మీనారాయణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖ ఉత్తరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. గత ఎన్నికల్లో ఆయన జనసేన తరుఫున విశాఖ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన జై భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉన్నట్లు ఆయన విశాఖ సీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.

Tags:
Next Story
Share it