AP: గ్రూప్-1 పరీక్ష రద్దుపై స్టే

ఏపీ హైకోర్ట్ 2018 గ్రూప్-1 ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రద్దుపై కీలక ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.

AP: గ్రూప్-1 పరీక్ష రద్దుపై స్టే
X

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ హైకోర్ట్ 2018 గ్రూప్-1 ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రద్దుపై కీలక ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. గ్రూప్- 1 పరీక్షపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే విధించింది. గ్రూప్-1 పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇటీవల తీర్పు చెప్పడంతో దీనిని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. రెండుసార్లు మూల్యాంకనం చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో సింగిల్ బెంచ్ ఈ పరీక్షను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారంతా కొనసాగుతారని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది.

Tags:
Next Story
Share it