KTR: గాలి తిరుగుళ్లు తిరిగిన వ్యక్తి బండి సంజయ్

తన పని తాను చేయకుండా మత విద్వేషాలను పిల్లల మనసులో నింపుతున్నారని విమర్శించారు.

KTR: గాలి తిరుగుళ్లు తిరిగిన వ్యక్తి బండి సంజయ్
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi)పై మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీర్వ విమర్శలు గుప్పించారు. ఈరోజు వేములవాడ(Vemulawada)లో BRS పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేటీఆర్‌తో పాటు కరీంనగర్(Karimnagar) BRS ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్(Vinod kumar) కూడా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. భద్రాచలంలోని మన ఐదు మండలాలను మనల్ని అడగకుండానే మోడీ ఆంధ్రాలో కలిపేశారని మండిపడ్డారు. అంతర్జాతీయ ముడి చమురు ధర తగ్గిందని తెలిపారు. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూనే ఉన్నారని వెల్లడించారు. ప్రధాని అంటే ప్రియమైన మోడీ కాదని.. పిరమైన మోడీ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన పని తాను చేయకుండా మత విద్వేషాలను పిల్లల మనసులో నింపుతున్నారని విమర్శించారు. రామున్ని, దేవున్ని మనకు పరిచయం చేసినట్లు బీజేపీ నేత బండి సంజయ్ ఫీలవుతున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ పుట్టకముందే దేవుడు ఉన్నాడని.. బీజేపీ ఓడిపోయినా దేవుడు ఉంటాడని తెలిపారు. ఐదేళ్లు ఒక్క పని కూడా చేయకుండా గాలి తిరుగుళ్లు తిరిగిన వ్యక్తి బండి సంజయ్ అని మండిపడ్డారు. ఎక్కడ ఉన్నావ్ అంటే మసీదులు తవ్వటం, ఏ వారం అనటమే బండికి తెలుసని వ్యాఖ్యానించారు.

Next Story
Share it