Bandi : సన్యాసం తీసుకుంటా: బండి సంజయ్

పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు.

Bandi : సన్యాసం తీసుకుంటా: బండి సంజయ్
X

న్యూస్ లైన్, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ ఎంపీగా తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశాడు. ఒకవేళ తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఒక్కటేనని ఆరోపించారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసిందని మండిపడ్డారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ప్రజలు మరోసారి మోసపోవద్దని కోరారు.

Tags:
Next Story
Share it