Brs Chief Kcr: కరీంనగర్ రోడ్ షోకు బయలుదేరిన కేసీఆర్
కుకునూర్ పల్లిలో కేసీఆర్ను గజమాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ ఇవాళ ఎర్రవెల్లిలోని నివాసం నుండి కరీంనగర్ రోడ్ షోకు బయలుదేరారు. కుకునూర్ పల్లిలో కేసీఆర్ను గజమాలతో ప్రజలు ఘన స్వాగతం పలికారు. అయితే ఆయన అక్కడ నుంచి కరీంనగర్ చేరుకుంటారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇక రేపు కేసీఆర్ బస్సు యాత్ర ముగిసిన అనంతరం సిద్దిపేటలో జరగనున్న భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు. సిద్దిపేటలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తారు.
Tags:
Next Story