Elections: ఒంటెపై వెళ్లి నామినేషన్ వేసిన అభ్యర్థి
పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఒంటెపై నామినేషన్ వెయ్యడానికి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాడు. ఇక విషయానికి వస్తే హైదరాబాద్ ఎంపీ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి అనిల్ సేన్ అనే వ్యక్తి ఒంటెపై వెళ్లాడు. అయితే అక్కడ ఉన్న ప్రజలు తనను ఒంటెపై చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, అక్కడ ఉన్న ప్రజలు ఒంటెపై నామినేషన్ వేయడానికి రావడం ఎంది రా బాబు అనుకున్నారు. అక్కడ ఉన్న కొంత మంది ఫోన్లో రికార్డు చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
Tags:
Next Story