modi: స్వలాభాల కోసం కాంగ్రెస్, ఎస్పీల ఆరాటం
రాబోయే ఐదేండ్ల కోసం కాకుండా మరో పాతికేండ్ల ప్రగతి ప్రస్ధానం దిశగా తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు.
న్యూస్ లైన్ డెస్క్: కాంగ్రెస్(Congress), సమాజ్వాదీ(Samajwadi) పార్టీలు సొంత లాభాల కోసమా ఆరాటపడుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Narendra modi) అన్నారు. ఆదివారం ఉత్తర్ప్రదేశ్(Uttar pradesh)లోని ఇటావాలో లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, ఎస్పీలు తమ భవిష్యత్, తమ పిల్లల భవిష్యత్ కోసం పనిచేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే ఐదేండ్ల కోసం కాకుండా మరో పాతికేండ్ల ప్రగతి ప్రస్ధానం దిశగా తాను పనిచేస్తానని హామీ ఇచ్చారు. తాను దేశం కోసం రాత్రి పగలు కష్టపడ్డ తీరు ప్రజలు చూశారని, నిజాయితీతో ప్రజలకు సేవ చేయడం తన ధర్మమని మోడీ అన్నారు.
Tags:
Next Story