Elections: ప్రచార ఖర్చులకు డబ్బులివ్వని కాంగ్రెస్.. టికెట్‌ ఇచ్చేసిన అభ్యర్థి

Elections: ప్రచార ఖర్చులకు డబ్బులివ్వని కాంగ్రెస్.. టికెట్‌ ఇచ్చేసిన అభ్యర్థి
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రచార ఖర్చులకు డబ్బు లేకపోవడంతో అభ్యర్థి టికెట్‌ను తిరిగి ఇచ్చేసిన ఘటన ఒడిశా(Odisha)లో చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) నేపథ్యంలో పూరి(Puri) నుండి కాంగ్రెస్ తరఫున సుచిత్ర మొహంతీ(Suchitra Mohanty) నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించాలి. ప్రచారం చేస్తేనే ప్రజల మధ్యన ఎక్కువ సమయం గడిపే అవకాశం లభిస్తుంది. కానీ, ప్రచారం చేయాలంటే అంతో ఇంతో డబ్బు కావాల్స వస్తుంది కాదా.. ఇక ఆ ఖర్చులకు కోసం డబ్బు లేకపోవడంతో సుచిత్ర మొహంతీ తన టికెట్‌ను పార్టీకి తిరిగి ఇచ్చేశారు.

దీనిపై స్పందించిన ఆమె.. పార్టీ నుంచి తనకు ప్రచారం కోసం నిధులు అందలేదని తెలిపారు. అసెంబ్లీ స్థానాల్లో బలహీన అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని.. మరోవైపు బీజేపీ(BJP), బీజేడీ(BJD) పార్టీలు ప్రచారం కోసం భారీగా ఖర్చు చేస్తున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బుల్లేకుండా పోటీ చేయడం కష్టమని. అందుకే టికెట్ ఇచ్చేశానని ఆమె వ్యాఖ్యానించారు.

Tags:
Next Story
Share it