farooq abdullah: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను ఇక మరువాల్సిందేనా?

తాజాగా దీనిపై స్పందించిన ఫ‌రూక్.. ర‌క్ష‌ణ మంత్రి ఇలా చెబితే ఇక ముందుకెళ్ల‌డ‌మే..వారిని ఆప‌డానికి మ‌నం ఎవ‌ర‌ని వ్యాఖ్యానించారు.

farooq abdullah: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను ఇక మరువాల్సిందేనా?
X

న్యూస్ లైన్ డెస్క్: పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(POK)పై నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్ చీఫ్‌, జ‌మ్ము క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్ధుల్లా(farooq abdullah) స్పందించారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ‌రూక్ అబ్ధుల్లా మాట్లాడారు. పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌ను భార‌త్‌లో విలీనం చేస్తామ‌ని ఇటీవల భారత ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) ప్రకటించారు. తాజాగా దీనిపై స్పందించిన ఫ‌రూక్.. ర‌క్ష‌ణ మంత్రి ఇలా చెబితే ఇక ముందుకెళ్ల‌డ‌మే..వారిని ఆప‌డానికి మ‌నం ఎవ‌ర‌ని వ్యాఖ్యానించారు. మరోవైపు, పాకిస్తాన్ వాళ్లు కూడా గాజులు తొడుక్కొని కూర్చోలేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. వారి వద్ద అణుబాంబు ఉందని.. దుర‌దృష్ట‌వ‌శాత్తూ మనమే దానికి బలైపోవాల్సిన పరిస్థితి రానుందని ఆయన పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it