AP: ఆవుల్ని వధించనని చెప్పడంతో స్తంభానికి కట్టేసి కొట్టారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది.

AP: ఆవుల్ని వధించనని చెప్పడంతో స్తంభానికి కట్టేసి కొట్టారు!
X

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమంగా నడుపుతున్న కబేళాలో పశువులను వధించాలని పరిగికి చెందిన వాజిద్‌ను నిర్వాహకులు తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆవులకు బాదులుగా ఎద్దులు కనిపించాయి. దీంతో వాజిద్ వాటిని వధించేందుకు నిరాకరించాడు. కాగా, నిర్వాహకులు ఆవులను విధించాల్సిందే అని వాజిద్ తో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే వాజిద్ తమ ఫోన్ దొంగలించాడంటూ నిర్వాహకులు అబద్ధపు ఆరోపణులు చేశారు. దాంతో వాజిద్‌ను అక్కడే ఉన్న స్తంభానికి కట్టేసి దారుణంగా చావ బాదారు. అక్కడ ఉన్న స్థానికులు ఈ ఘటనను ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Tags:
Next Story
Share it