Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఐపీఎల్ (ipl) సీజన్-17లో భాగంగా హైదరాబాద్‌ (Hyderabad) ఉప్పల్‌ స్టేడియంలో (uppal stadium) ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (SRH VS RCB) మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

Hyderabad: ఉప్పల్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్తత
X

న్యూస్ లైన్ డెస్క్: ఐపీఎల్ (ipl) సీజన్-17లో భాగంగా హైదరాబాద్‌ (Hyderabad) ఉప్పల్‌ స్టేడియంలో (uppal stadium) ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (SRH VS RCB) మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బ్లాక్‌లో అమ్ముకుంటోందని యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు (Jaganmohan rao) తనకు చెందిన అక్షర స్కూల్స్ యాజమాన్యంతో కుమ్మక్కు అయ్యి టికెట్లను అక్రమంగా అమ్మారంటూ యూత్ నాయకులు ఆరోపిస్తున్నారు.

యూత్ నాయకులు hca అధ్యక్షుడు జగన్మోహన్ రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని రోడ్డుపై నినాదాలు చేశారు. నిరసన కారులు స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు.

Tags:
Next Story
Share it