Kangana Ranaut: సొంత పార్టీ నేతనే విమర్శించిన కంగనా

చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలనుకుంటున్న రాహుల్ గాంధీ అంతే, గూండాయిజం చేసి చేపలు తినే తేజస్వి సూర్య అయినా అంతే అని ఆమె వ్యాఖ్యానించారు.

Kangana Ranaut: సొంత పార్టీ నేతనే విమర్శించిన కంగనా
X

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు కంగనా రణౌత్(Kangana Ranaut) సొంత పార్టీ నేతపై విమర్శల వర్షం కురిపించారు. హిమాచల్‌‌ప్రదేశ్‌(Himachalpradesh)లోని మండి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుందర్‌నగర్(Sunder nagar) ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ నేతను విమర్శించాలనుకున్నారు. కానీ, పొరపాటున సొంత పార్టీ నేతను విమర్శించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్‌(Congress), ఆర్జేడీ(RJD)పై ఆమె విమర్శలు చేశారు. 'చెడిపోయిన యువరాజుల పార్టీ ఉంది. ఎక్కడికి వెళ్లాలో వారికే తెలియదు. చంద్రుడిపై బంగాళదుంపలు పండించాలనుకుంటున్న రాహుల్ గాంధీ(Raul Gandhi) అంతే, గూండాయిజం చేసి చేపలు తినే తేజస్వి సూర్య(Tejaswi Surya) అయినా అంతే అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్‌(Tejaswi Yadav)ను ఉద్దేశించి అనాల్సిన మాటలను పొరపాటున బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యను అన్నారు. అయితే, వీరిద్దరి పేర్లు తేజస్వి అనే పదంతో మొదలుకావడంతో కంగనా పొరపాటు పడ్డారు.

Tags:
Next Story
Share it