Kenya: డ్యామ్ కూలి 40 మంది మృతి

ఆప్రికా (Africa) దేశం కెన్యా (Kenya)లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు (heavy rains) ఓ డ్యామ్ (dam) కూలి 40 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్‌ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌ కూలిపోయింది.

Kenya: డ్యామ్ కూలి 40 మంది మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: ఆప్రికా (Africa) దేశం కెన్యా (Kenya)లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ వర్షాలకు (heavy rains) ఓ డ్యామ్ (dam) కూలి 40 మంది మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ కెన్యాలోని రిఫ్ట్‌ వ్యాలీకి చెందిన మాయి మహియు పట్టణంలోని కిజాబె డ్యామ్‌ కూలిపోయింది. దీంతో దిగువ ప్రాంతాల్లోకి నీరు ప్రవహించడంతో ఇళ్లు, ప్రధాన రహదారులు ధ్వంసమైయాయి. వరదల్లో చాలామంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 40 మృతి చెందినట్లు సమాచారం. ఇంకా చాలా మంది వరద నీటిలో కొట్టుకుపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు.

అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టినట్లు సమాచారం. కొట్టుకుపోయిన వారికోసం వెతుకుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ భారీ వర్షాలకు దేశంలో వందల మంది మృతిచెందినట్లుగా సమాచారం. అక్కడ ఎల్‌నివో వల్లే ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దేశ ప్రజలు, డ్యామ్ పరిసరా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికాలు జారీచేశారు.

Tags:
Next Story
Share it