Komuram Bhim Asifabad: ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి

కొమురం భీం ఆసిఫాబాద్ (komuram bhim asifabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. రెండు ద్విచక్ర వాహానాలు (two bikes) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.

Komuram Bhim Asifabad: ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్:మురం భీం ఆసిఫాబాద్ (komuram bhim asifabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. రెండు ద్విచక్ర వాహానాలు (two bikes) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని బెజ్జూరు మండలం (bejjur mandal) పోతేపల్లి (pothepalli) వద్ద రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మహేష్ (Mahesh), వెంగల్‌రావు (vengalrao), నర్సింహ (narsimha) అనే ముగ్గురు మృతిచెందారు. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కాగా, వేగంగా బైకులు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Tags:
Next Story
Share it