MadyaPradesh: ట్రాక్టర్‌తో తొక్కించి పోలీస్ హాత్య

మధ్యప్రదేశ్‌లోని (madya Pradesh) షాదోల్ జిల్లాలో (shadol district) ఘోరం జరిగింది. అక్రమంగా ఇసుక (sand) తరలిస్తుండగా అడ్డగించే ప్రయత్నంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ (tractor driver) ఏఎస్ఐని తొక్కించి చంపాడు.

MadyaPradesh: ట్రాక్టర్‌తో తొక్కించి పోలీస్ హాత్య
X

న్యూస్ లైన్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని (madya Pradesh) షాదోల్ జిల్లాలో (shadol district) ఘోరం జరిగింది. అక్రమంగా ఇసుక (sand) తరలిస్తుండగా అడ్డగించే ప్రయత్నంలో ఓ ట్రాక్టర్ డ్రైవర్ (tractor driver) ఏఎస్ఐని తొక్కించి చంపాడు. స్థానిక పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. షాదోల్ జిల్లా కేంద్రానికి చెందిన ఏఎస్ఐ మహేంద్ర బాగ్రీకి (asi mahendra bagri) ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం వచ్చింది. దీంతో మహేంద్ర బాగ్రీ.. ప్రసాద్ కనోజీ, సంజయ్ దూబే అనే ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్‌ని అడ్డగించపోయారు. డ్రైవర్ ట్రాక్టర్‌ని ఆపకుండా తొక్కించాడు. ఈ ఘటనలో ఏఎస్ఐ మహేంద్ర బాగ్రీ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు కానిస్టేబుళ్లు తప్పించుకున్నారు. ఘటన అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ తప్పించుకొని పారిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it