Nagarkurnool: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన మైనారిటీ సంస్థ

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు (loksabha elections) సమీపిస్తుడడంతో మైనార్టీ కులాలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిలకు తమ మద్దతు తెలుపుతున్నారు.

Nagarkurnool: బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన మైనారిటీ సంస్థ
X

న్యూస్ లైన్ డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ (congress) పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని.. రాష్ట్రంలోని ఇతర పార్టీ నాయకులతో పాటు ప్రజలు ఆ పార్టీపై మండిపడుతున్నారు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పొగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి (brs party) మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు (loksabha elections) సమీపిస్తుడడంతో మైనార్టీ కులాలు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిలకు తమ మద్దతు తెలుపుతున్నారు.

తాజాగా నాగర్‌కర్నూల్ జిల్లా (nagarkurnool district) పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్‌కి (rs Praveen kumar) రాష్ట్ర ప్రధాన ముస్లిం మైనారిటీ సంస్థ (muslim minority) మద్దతు ప్రకటించింది. జిల్లాలోని అన్ని వ‌ర్గాల ప్రజల నుంచి ఆయనకు విశేష‌మైన మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ఆయనను గెలిపించి, పార్ల‌మెంట్‌కు పంపిస్తామ‌ని జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్రధాన ముస్లిం మైనార్టీ సంస్థ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పార్లమెంట్ ప‌రిధిలోని ముస్లింలంతా ఆయనకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలుపించాలని వారు విజ్ఞ‌ప్తి చేశారు.

Tags:
Next Story
Share it