Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
రాజస్థాన్లో (rajasthan) సవాయ్ మాధోఫూర్ జిల్లాలో (sawai madhopur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. గుర్తు తెలియని వాహనం ఓ కారుని (car) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.
న్యూస్ లైన్ డెస్క్: రాజస్థాన్లో (rajasthan) సవాయ్ మాధోఫూర్ జిల్లాలో (sawai madhopur district) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. గుర్తు తెలియని వాహనం ఓ కారుని (car) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఢిల్లీ-ముంభై ఎక్స్ప్రెస్ హైవేపై బనాస్ నది వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కారులో ఓకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది సవాయి మాధోపూర్లోని గణేష్ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్తున్నట్లు సమాచారం. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నట్లు తెలిపారు. మనన్, దీపాలి శర్మ అనే ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.