Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

ఉత్తరాఖండ్ (uttarakhand) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ కారు (car) అదుపుతప్పి ఘట్ రోడ్డు నుంచి కింద రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరొక్కరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Uttarakhand: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: ఉత్తరాఖండ్ (uttarakhand) ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. ఓ కారు (car) అదుపుతప్పి ఘట్ రోడ్డు నుంచి కింద రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరొక్కరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ముస్సోరీ డెహ్రాడూన్ (mussoorie dehradun) మార్గ్ ఝడిపానీ రోడ్‌లోని (jhadipani road) పానీ వాలా బ్యాండ్ (pani wala band) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వీరంతా డెహ్రాడూన్ ఐఎంఎస్ కాలేజీలో (IMS college) చదువుతున్న విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. కారులో నలుగురు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు విహారయాత్ర కోసం ముస్సోరీకి వచ్చినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, నాన్సీ (nancy) అనే బాలిక తీవ్రంగా గాయపడింది. ఆమెను చికిత్స నిమిత్తం స్థానికి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఎస్పీ ప్రమోద్ కుమార్ (sp pramod kumar) తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it