Weather: ఎండలపై వాతావరణ శాఖ కీలక సూచనలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఈ సీజన్లో ఇప్పటికే మూడుసార్లు హీట్ వేవ్ అలెర్ట్ చేసింది.
న్యూస్ లైన్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ శాఖ ఈ సీజన్లో ఇప్పటికే మూడుసార్లు హీట్ వేవ్ అలెర్ట్ చేసింది. తెలంగాణలో ఈ సీజన్లోనే అత్యధికంగా 43 డిగ్రీలు భద్రాచలం, ఖమ్మంలో నమోదైయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటితున్న ఉష్ణోగ్రతలు. ఏపీలో 63 మండలాల్లో తీవ్ర వడగాలులు. తెలంగాణలో రేపు, ఎల్లుండి మూడు రోజులు ఆసిఫాబాద్, మంచిర్యాల, జనగాం, పెద్దపల్లి, జగిత్యాల, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో 41 నుంచి 44 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయి వడగాలులు వీచే అవకాశం ఉందన అధికారులు.
అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. మండుతున్న ఎండల నేపథ్యంలో వాతవారణ శాఖ ప్రజలకు పలు సూచనలు చేసింది. ప్రజలు ఎవరు ఇంటి నుంచి ఎక్కువగా బయటకి రావోద్దని తెలిపింది. బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఉష్ణోగ్రతల నేపథ్యంలో అవసరానికి మించి ఎండల్లో తిరగోద్దని విలైనంత వరకు ఇంట్లోనే ఉండాలే చూసుకోవాలని అధికారుల పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.