Cm Jagan: ఇవాళే వైసీపీ మేనిఫెస్టో విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్

Cm Jagan: ఇవాళే వైసీపీ మేనిఫెస్టో విడుదల
X

Cm Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది. అదే రోజున తెలంగాణ రాష్ట్రంలో కూడా పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీలో... మరోసారి అధికారంలోకి రావడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) తన దైన వ్యూహాలతో ముందుకు అడుగులు వేస్తున్నారు. బస్సు యాత్రలు, బహిరంగసభలు, నిర్వహించుకుంటూ ప్రతిపక్షాలకు ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి (Cm Jagan).

ఇక ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. మేనిఫెస్టో రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి (Cm Jagan). నవరత్నాలు ప్లస్ పేరుతో వైసిపి పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan). ఇవాళ మధ్యాహ్నం తాడేపల్లిలో ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మళ్లీ తెరపైకి మెగా డీఎస్సీని తీసుకురావడమే కాకుండా సిపిఎస్ రద్దు హామీని నెరవేర్చేలా మేనిఫెస్టోను రూపొందించనుందట వైసిపి. అలాగే విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. మరి ఇవాళ రిలీజ్ చేయబోయే వైసిపి మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు ఉంటాయో చూడాలి.

Tags:
Next Story
Share it