Tirupati : తిరుపతి లో జనసేన - వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట..!

మరో 16 రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఇటీవలే నామినేషన్స్ ప్రక్రియ కూడా అన్నీ ప్రాంతాలకు సంబంధించి పూర్తి అయ్యాయి.

Tirupati : తిరుపతి లో జనసేన - వైసీపీ కార్యకర్తల మధ్య కొట్లాట..!
X

న్యూస్ లైన్, తిరుపతి: మరో 16 రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా జరగనున్నాయి. ఇటీవలే నామినేషన్స్ ప్రక్రియ కూడా అన్నీ ప్రాంతాలకు సంబంధించి పూర్తి అయ్యాయి. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం లో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఈ సందర్భంగా తిరుపతి లోని ఒక డివిజన్ లో జనసేన, వైసీపీ పార్టీల మధ్య గొడవ ఎవ్వరూ ఊహించని స్థాయిలో జరిగాయి. ఒక డివిజన్ లో ప్రచారం లో భాగంగా జనసేన పార్టీ కార్యకర్తలు విచ్చేసారు. అదే సమయంలో వైసీపీ కార్యకర్తలు కూడా ప్రచారానికి విచ్చేసారు. ఈ క్రమం లో ఇరు వర్గాల మధ్య మాటలు పెరిగి గొడవకి దారి తీసింది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇకపోతే తిరుపతి స్థానం నుండి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు మీద ఆరని శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ పార్టీ నుండి భూమన అభినవ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య ప్రస్తుతం నువ్వా నేనా అనే రేంజ్ పోటీ ఏర్పడింది.

Tags:
Next Story
Share it