Indians: అమెరికాలో ముగ్గురు భార‌తీయ మ‌హిళ‌లు మృతి

గుజ‌రాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా అక్కడి మీడియా పేర్కొంది.

Indians: అమెరికాలో ముగ్గురు భార‌తీయ మ‌హిళ‌లు మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా(America)లో ముగ్గురు భార‌తీయ మ‌హిళ‌లు మృతిచెందారు. గుజ‌రాత్‌(Gujarat)లోని ఆనంద్ జిల్లాకు చెందిన ముగ్గురు మహిళలు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లుగా అక్కడి మీడియా పేర్కొంది. ద‌క్షిణ క‌రోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలో రేఖాబెన్ ప‌టేల్‌, సంగీతబెన్ ప‌టేల్‌, మ‌నీషాబెన్ ప‌టేల్ లతో వెళ్తున్న SUV కారు అదుపు తప్పి లైన్లను దాటుకుంటూ వెళ్లి ఒక్కసారిగా 20 అడుగుల ఎత్తులోకి ఎగిరినట్లుగా అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, అతివేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Tags:
Next Story
Share it