BRS: 'దారి పొడవునా రాజీలేని రణం..!'- BRSపై కవిత రాసిన కేటీఆర్

పార్టీలో ఉంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రమించిన వారందరికీ, కార్యకర్తలకు అభిమానులకు కేటీఆర్.. BRS దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

BRS: దారి పొడవునా రాజీలేని రణం..!- BRSపై కవిత రాసిన కేటీఆర్
X

న్యూస్ లైన్ డెస్క్: నేడు భారత రాష్ట్ర సమితి(BRS) పార్టీ 24వ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కవిత రాశారు. పార్టీలో ఉంటూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రమించిన వారందరికీ, కార్యకర్తలకు అభిమానులకు కేటీఆర్.. BRS దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఓ కవిత రాసి తన ఖాతాలో పోస్ట్ చేశారు.

BRS పార్టీ పుట్టుక అనేదే ఒక సంచలనమని.. దారి పొడవునా రాజీలేని రణం అని పేర్కొన్నారు. జలదృశ్యంతో ఉదయించిన గులాబీ పతాకం ఉర్రూతలూగించే ఉద్యమ దృశ్యాలను ఆవిష్కరించిందని వెల్లడించారు. BRS జెండా మోసి..జంగ్ చేసిన లక్షలాది కార్యకర్తలే తమకు బలం..బలగమని కేటీఆర్ పేర్కొన్నారు. కంటికి రెప్పలా పార్టీని కాపాడుకున్న కార్యకర్తల పట్టుదల, శ్రమ, కృషికి సలాం అంటూ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.


Tags:
Next Story
Share it