Telangana: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎక్కడ చూసినా రైతు గోసలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల పరిస్థితి

Telangana: తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య
X

Telangana: తెలంగాణ రాష్ట్రంలో రైతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఎక్కడ చూసినా రైతు గోసలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నల పరిస్థితి అగోమ్యాచారంగా తయారైంది. అయితే తాజాగా నీళ్లు లేక పంట ఎండిపోయి మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కల్లపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి పంట సాగు చేశాడు సత్తయ్య. అయితే సరిగా నీళ్లు లేక... దిగుబడి రాలేదు. అటు అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి.

ఈ తరుణంలోనే వ్యవసాయ బావి దగ్గర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సత్తయ్య. అయితే పురుగుల మందు తాగిన వెంటనే సిద్దిపేటకు సత్తయ్యని తరలించే ప్రయత్నం చేశారు. కానీ దారి మధ్యలోనే సత్తయ్య మరణించాడు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:
Next Story
Share it