KTR in Sirisilla: సిరిసిల్లలో కేటీఆర్ ఏం చేశాడంటే..?

పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారంలో బీఆర్ఎస్ (BRS ) దూకుడు పెంచింది. ఓ వైపు రోడ్ షోలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR ) ప్రతి రోజు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు.

KTR in Sirisilla: సిరిసిల్లలో కేటీఆర్ ఏం చేశాడంటే..?
X

న్యూస్ లైన్, సిరిసిల్ల : పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రచారంలో బీఆర్ఎస్ (BRS ) దూకుడు పెంచింది. ఓ వైపు రోడ్ షోలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR ) ప్రతి రోజు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం అన్ని నియోజకవర్గాలు పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా తన సొంత నియోజకవర్గం సిరిసిల్ల(Sirisilla)లో శనివారం మార్నింగ్ నిర్వహించారు. పట్టణంలో పలు విధుల్లో తిరుగుతూ ఇంటింటికిం వెళ్లి కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ (Vinod Kumar)ను గెలిపించాలంటూ కోరారు.

సిరిసిల్లలోని రైతుబజార్ దగ్గర రైతులు, ప్రజలను కలుసుకున్నారు. అక్కడి నుంచి గాంధీచౌక్ దగ్గర ఉన్న పాత మార్కెట్ యార్డులకు వెళ్లి అక్కడ కూరగాయాలు అమ్ముతున్నవారిని సైతం ఆప్యాయంగా పలకరించారు. వ్యాపారం ఎలా జరుగుతుందంటూ అడిగి తెలుసుకున్నారు. అంతుకుముందు రోడ్డు పక్కన ఉన్న టీ షాపు దగ్గరకు వెళ్లారు. ప్రజలతో కలిసి టీ తాగుతూ వారితో మాట ముచ్చట జరిపారు. పార్లమెంట్ లో తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలని కేటీఆర్ కోరారు.

Tags:
Next Story
Share it