Video: రేవంత్ రెడ్డి సభకు వచ్చిన జనాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే...!

సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ప్రెస్టీజ్‌గా తీసుకున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఫుల్ బిజీబిజీగా తిరుగుతున్నాడు.

Video: రేవంత్ రెడ్డి సభకు వచ్చిన జనాన్ని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే...!
X

న్యూస్ లైన్, సిరిసిల్ల: సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ప్రెస్టీజ్‌గా తీసుకున్నారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఫుల్ బిజీబిజీగా తిరుగుతున్నాడు. ఈ ఎన్నికలు తనకు రెఫరెండంగా చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. అయితే రేవంత్ రెడ్డి సభలకు మాత్రం జనం పెద్దగా తరలిరావడం లేదు. దీంతో ఆయన సభలు, రోడ్ షోలు వెలవలబోతున్నాయి. అప్పటికే ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. పోటీ చేసే అభ్యర్ధులను సైతం జనాన్ని భారీగా సమీకరించాలని ఆదేశాలు ఇచ్చినా గ్రౌండ్ లెవల్లో సీన్ మాత్రం మారడం లేదు. కాంగ్రెస్ సభలకు జనం వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

సిరిసిల్ల నియోజకవర్గంలో శుక్రవారం రాత్రి జరిగిన రేవంత్ రెడ్డి సభలోనూ అదే తీరు. జనం లేక ఖాళీ కుర్చీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కొంత మంది ముందుకు వెళ్లినా కుర్చీలు మాత్రం ఫుల్‌ ఖాళీగా కనిపిస్తున్నాయి. అయితే ఎంత మంది ముందుకువెళ్లినా ఇంతలా కుర్చీలు ఖాళీగా ఉండటంతో జనం ఆశ్చర్చపోతున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చినా ఇలా ఖాళీ కుర్చీలు ఉండటం ఏంటని చర్చించుకుంటున్నారు.



Tags:
Next Story
Share it