Congress: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు దొరకట్లేవు

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) వచ్చాక నీళ్లు దొరకట్లేవు అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress)

Congress: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీళ్లు దొరకట్లేవు
X

Congress: కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) వచ్చాక నీళ్లు దొరకట్లేవు అంటూ మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు తెరపైకి వస్తున్నాయి. గడిచిన పది సంవత్సరాల గులాబీ పార్టీ కాలంలో... తెలంగాణ ప్రజలు చాలా ఆనందంగా బతికారు. కానీ కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లోనే కరువు వచ్చింది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) పంట పొలాలు పూర్తిగా ఎండిపోయాయి. ఆగుదామంటే మంచి నీళ్లు కూడా దొరకడం లేదు. గతంలో వచ్చినట్లుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు.... రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. అయితే తాజాగా ఓ మహిళా కాంగ్రెస్ ప్రభుత్వం పై (Congress) విమర్శలు చేశారు.

గ్రామాల్లో వారు పడుతున్న బాధలను వివరించారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి తాగడానికి కూడా నీళ్లు దొరకట్లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే కొన్ని నీళ్లు కూడా తోటకు పారబెట్టుకుంటున్నారు.. వాళ్లను అడిగితే తోట ఎండబెట్టి మీకు నీళ్లు ఇవ్వాలా అని ఇస్తలేరని ఫైర్‌ అయ్యారు ఆ మహిళ. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి పక్కింటోళ్లు కూడా తాగడానికి నీళ్లు ఇవ్వట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఒక్కరే కాకుండా.. రైతులందరూ తమ సమస్యలను విన్నవించారు.

Tags:
Next Story
Share it