KCR: రేపటి నుంచి యధావిధిగా కేసీఆర్ బస్సు యాత్ర

రేపటి నుంచి యధావిధిగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై (KCR) ఈసీ 48 గంటల నిషేధాన్ని విధించింది. దీంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి

KCR: రేపటి నుంచి యధావిధిగా కేసీఆర్ బస్సు యాత్ర
X

KCR: రేపటి నుంచి యధావిధిగా కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై (KCR) ఈసీ 48 గంటల నిషేధాన్ని విధించింది. దీంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో (karimnagar)జరగాల్సిన బస్సుయాత్ర రద్దు అయింది. గురువారం సాయంత్రం జమ్మికుంటలో రోడ్ షోలో పాల్గొని వీణవంకల బస చేయాల్సి ఉంది. ఈనెల 3న రామగుండంలో బస్సు యాత్ర చేసి అక్కడే బస చేయాల్సి ఉంది.

మారిన షెడ్యూల్ ప్రకారం రామగుండంలో బస మాత్రమే చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఈసీ 48 గంటల నిషేధాన్ని విధించడంపై బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అదే స్థాయిలో ఫైర్‌ అయ్యారు. తాను లేకున్నా.. బీఆర్‌ఎస్‌ నేతలు ప్రచారం చేస్తారన్నారు కేసీఆర్‌ (KCR). అయితే... రేపటి నుండి యధావిధిగా కొనసాగనుంది కేసీఆర్ బస్సు యాత్ర. రేపు రాత్రి 8 తర్వాత రామగుండం రోడ్డు షోలో ప్రసంగించనున్నారు కేసీఆర్. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

Tags:
Next Story
Share it