KCR: నాగర్కర్నూల్కు బయల్దేరిన గులాబీ బాస్
ఈ సందర్భంగా.. నాగర్కర్నూల్ వెళ్లే మార్గంలో భూత్పూర్ గ్రామం వద్ద కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.
న్యూస్ లైన్ డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ సీఎం, BRS అధినేత ప్రజల బస్సు యాత్ర చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో 8 నుండి 12 స్థానాల్లో గెలిచే దిశగా BRS అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రజలలో తిరుగుతూ.. వారి సమస్యలు తెలుసుకోవడానికి KCR చేపట్టిన బస్సు యాత్ర నేటితో నాలుగో రోజుకు చేరుకుంది. యాత్ర ప్రారంభించిన తొలిరోజున మిర్యాలగూడ, సూర్యాపేటలో ఆయన పర్యటించి.. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకున్నారు. రెండో రోజున భువనగిరి, నకిరేకల్, చిట్యాల, నార్కెట్ పల్లిల్లో ఆయన బస్సు యాత్రలు నిర్వహించారు.
మూడో రోజున మహబూబ్నగర్(Mahaboobnagar)లో నిర్వహించిన BRS భారీ బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. మూడో రోజు బస్సు యత్రలో భాగంగా ఎర్రవెల్లి నుంచి బయలుదేరి.. శామీర్పెట్ ORR మీదుగా.. షాద్నగర్, బాలానగర్లో రోడ్ షో నిర్వహించారు. అక్కడి నుండి జడ్చర్ల క్రాస్ రోడ్ మీదుగా బస్సు యాత్రలో పాల్గొన్నారు. కాగా, ఈరోజు మహబూబ్నగర్ నుండి నాగర్కర్నూల్కు బయలుదేరారు. ఈ సందర్భంగా.. నాగర్కర్నూల్(Nagarkurnool) వెళ్లే మార్గంలో భూత్పూర్ గ్రామం వద్ద కేసీఆర్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నాగర్కర్నూల్ చేరుకున్న తర్వాత అక్కడ నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నా