Cm Revanth : ‘వాడెవడో’ అంటూ కడియం ఆగ్రహం

స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర అసహనానికి గురయ్యారు. వాడెవడో అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారారు.

Cm Revanth : ‘వాడెవడో’ అంటూ కడియం ఆగ్రహం
X

కులంపై ఎంక్వయిరీకి గతంలో రేవంత్ డిమాండ్

ఇదే విషయాన్ని అడిగిన జర్నలిస్ట్

వాడెవడో మాట్లాడిండని నాదగ్గర మాట్లాడొద్దు

తీవ్రంగా స్పందించిన కడియం

తెలంగాణం, హైదరాబాద్: స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర అసహనానికి గురయ్యారు. వాడెవడో అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై నోరు జారారు. శనివారం మీడియాతో మాట్లాడుతుండగా కుల ప్రస్తావన వచ్చిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి కులంపై కమిషన్ వెయ్యాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు కదా అని జర్నలిస్ట్ అన్నారు. దీంతో కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘దయచేసి ఇంకోసారి ఈ ప్రస్తావన నా దగ్గర తీసుకు రావొద్దు. మీకు ఏమాత్రం అనుమానం లేకుండా చట్టపరంగా నామినేషన్ ఆమోదం పొందినప్పుడు.. వాడెవడో మాట్లాడిండని నా దగ్గర మాట్లాడొద్దు’’ ఘాటుగా సమాధానం ఇచ్చారు. వాడు, వీడు అన్న పదాలు ఆయన నోటి నుంచి రావడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కడియం అంత మాట అనేశారేంటన్న చర్చ జరుగుతోంది.

Tags:
Next Story
Share it