Berasia Polling Booth: మైన‌ర్ కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ నేత!

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని( mp) బెరాసియాలో విన‌య్ మెహ‌ర్( vinay mehar) అనే బీజేపీ నేత ఏ మాత్రం సంకోచం లేకుండా తన కొడుకుతో ఓటు వేయించాడు

Berasia Polling Booth: మైన‌ర్ కుమారుడితో ఓటు వేయించిన బీజేపీ నేత!
X

న్యూస్ లైన్,స్పెషల్ డెస్క్: మూడో ద‌శ లోక్‌స‌భ ( loksabha) ఎన్నిక‌ల్లో భాగంగా ఈ నెల 7న జ‌రిగిన పోలింగ్‌లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని( mp) బెరాసియాలో విన‌య్ మెహ‌ర్( vinay mehar) అనే బీజేపీ నేత ఏ మాత్రం సంకోచం లేకుండా తన కొడుకుతో ఓటు వేయించాడు. ఓటు అనగానే బాధ్యత గల పౌరుడు అనుకోకండి. ఆ బాలుడు మైనర్..ఆ పిల్లాడు ఈవీఎం లో బటన్ నొక్కి బీజేపీ కి ఓటు వేస్తుండగా వీడియో తీశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

దీంతో స్పందించిన భోపాల్ క‌లెక్ట‌ర్ కౌశ‌లేంద్ర విక్ర‌మ్ సింగ్ ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన బీజేపీ నేత విన‌య్ మెహ‌ర్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయించారు. ఈ ఘటన పోలింగ్ కేంద్రంలోని ప్రీ సైడింగ్ అధికారి సందీప్ సైనీ తో సహా స్టాఫ్ వాళ్లందరిని సస్పెండ్ చేశారు.

మ‌రోవైపు కాంగ్రేస్ నేత క‌మ‌ల్ నాథ్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించారు. "ఈసీని ( ec) బీజేపీ పిల్ల‌ల ఆట‌వ‌స్తువుగా మార్చేసింది. పిల్ల‌ల‌ను, మొబైల్‌ను పోలింగ్ కేంద్రం లోప‌లికి ఎలా అనుమ‌తించారు? ఏమైనా చ‌ర్య‌లు తీసుకుంటారా?" అని ప్ర‌శ్నించారు. సోషల్ మీడియాలో ఈ విషయం పై ఫుల్ ఫైర్ అవుతున్నారు నెటిజన్లు.



Tags:
Next Story
Share it