Heavy rains: వర్షాల వల్ల కూలిపోయిన డ్యాం.. 45 మంది మృతి

దీంతో ఎన్నో వందల ఏళ్ల నాటి కిజాబె డ్యాం కూలిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు.

Heavy rains: వర్షాల వల్ల కూలిపోయిన డ్యాం.. 45 మంది మృతి
X

న్యూస్ లైన్ డెస్క్: భారీ వర్షాల కారణంగా డ్యాం(Dam) కూలిపోయి 45 మంది మృతిచెందిన ఘటన ఆఫ్రికా(Africa)లో చోటుచేసుకుంది. కెన్యా(Kenya)లోని మై మహియు ప్రాంతంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఎన్నో వందల ఏళ్ల నాటి కిజాబె డ్యాం కూలిపోయింది. ఈ ఘటనలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, స్థానికంగా ఉన్న ఇళ్లు కూలిపోయాయి. దీంతో వందల మంది ప్రజలు నివాసాన్ని కోల్పోయారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న సుమారు 2 లక్షల మంది దగ్గర్లోని పాఠశాలల్లో ఉంటున్నారని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు ఇప్పటికే ఇచ్చిన పాఠశాల సెలవులను ప్రభుత్వం పొడిగించింది. కాగా, ఇప్పటివరకూ వర్షాల కారణంగా 155 మందికి పైగా ప్రజలు మృతిచెందినట్లు సమాచారం.

Tags:
Next Story
Share it