Global Report On Food Crises: తిండిలేక ఆకలితో అలమటిస్తున్న 28.2 కోట్ల మంది ప్రజలు

ఆకలికి సంబంధించిన నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది.

Global Report On Food Crises: తిండిలేక ఆకలితో అలమటిస్తున్న 28.2 కోట్ల మంది ప్రజలు
X

Global Report On Food Crises: ఆకలికి సంబంధించిన నివేదికను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2023 సంవత్సరంలో 59 దేశాల నుండి సుమారు 282 మిలియన్ల మంది ఆకలితో బాధపడ్డారు. ఐక్యరాజ్యసమితి బుధవారం ఆహార సంక్షోభంపై గ్లోబల్ రిపోర్ట్‌లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. గాజాలో ప్రజలు ఆకలితో అత్యంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నారని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా గాజా స్ట్రిప్ , సూడాన్‌లో దిగజారుతున్న ఆహార భద్రత పరిస్థితుల కారణంగా 2022లో 24 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొన్నారు.

అంతర్జాతీయ నిపుణులు ఐదు దేశాల్లోని 705,000 మంది ఆకలిని ఐదో దశలో ఉంచారని, ఇది అత్యున్నత స్థాయిగా పరిగణించబడుతుంది. 2016లో గ్లోబల్ రిపోర్టు ప్రారంభమైనప్పటి నుంచి ఈ సంఖ్య అత్యధికమని, 2016లో నమోదైన సంఖ్యతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిందని చెప్పారు. తీవ్ర కరువును ఎదుర్కొంటున్న వారిలో 80 శాతం మంది, అంటే 5,77,000 మంది ఒక్క గాజాలోనే ఉన్నారని ఆర్థికవేత్త మాక్సిమో టొరెరో చెప్పారు. దక్షిణ సూడాన్, బుర్కినా ఫాసో, సోమాలియా, మాలీలలో వేలాది మంది ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. ఇక్కడ సాయం అందించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

గాజాలో సుమారు 1.1 మిలియన్ల మంది, దక్షిణ సూడాన్‌లో 79,000 మంది జూలై నాటికి ఐదవ దశకు చేరుకోవచ్చని.. కరువును ఎదుర్కోవచ్చని నివేదిక అంచనా వేసింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఏడు నెలలుగా యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కారణంగా హైతీలో ఆహార కొరత పెరుగుతుంది.

Tags:
Next Story
Share it