Uttar Pradesh: రైల్ ఇంజిన్ మధ్య ఇరుక్కున్న బాలుడు
ఓ బాలుడు రైల్ ఇంజిన్ (train engine) మధ్య ఇరుక్కుని 100 కి.మీ ప్రయాణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో (uttar Pradesh) చోటుచేసుకుంది.
న్యూస్ లైన్ డెస్క్: ఓ బాలుడు రైల్ ఇంజిన్ (train engine) మధ్య ఇరుక్కుని 100 కి.మీ ప్రయాణించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో (uttar Pradesh) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని హర్దోయ్ జిల్లాలో (hardoi district) స్టేషన్ సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడు అక్కడే పట్టాలపై ఆగి ఉన్న గూడ్స్ రైలు ఎక్కాడు. వెంటనే అది కదలడంతో దిగలేక ఆ బాలుడు రైలు మీదనే ఉండిపోయాడు. రైలు వెళ్లాల్సిన స్టేషన్కి చేరుకుంది. ఆ బాలుడు ఇరుక్కుని రైలు మీదనే ఉండిపోయాడు. స్టేషన్ చేరుకున్నాక ఓ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారి ఆ బాలుడిని చూసి రైలు మీద నుంచి కిందకి దించాడు. 100 కి.మీ రైలులో ఇరుక్కుని ప్రయాణించిన ఆ బాలుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదని ఆ అధికారి తెలిపాడు. అధికారులు బాలుడిని వివరాలు అడిగి తిరిగి అతడిని వల్ల గ్రామానికి పంపే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
Tags:
Next Story