Jyothi Raj : ఇండస్ట్రీ లో చాలా మంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ !

మతం మార్చుకోమని, పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసుపై తన వెర్షన్ ను చెప్పారు జ్యోతి రాజ్. 


Published Sep 20, 2024 05:11:00 PM
postImages/2024-09-20/1726832520_Screenshot20240920170908.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జానీ మాస్టర్ ఇష్యూపై వీడియో రిలీజ్ చేశారు జ్యోతి రాజ్. శ్రేష్ట చెప్పేది నిజమే అయితే ..జానీ మాస్టర్ ను కఠినంగా శిక్షించాలని అన్నారు.గత కొద్ది రోజులుగా జానీ మాస్టర్ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు మతం మార్చుకోమని, పెళ్లి చేసుకొమ్మని బలవంతపెట్టాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసుపై తన వెర్షన్ ను చెప్పారు జ్యోతి రాజ్. 


ఈ వీడియో లో ఎక్కడా జానీ పేరు కాని ఆ అమ్మాయి పేరు కాని మెన్షన్ చెయ్యలేదు. జస్ట్ ఓ వీడియోను రిలీజ్ చేశారు.అందులో కొంతమంది అమ్మాయిలు చాలా స్మార్ట్ ఉంటారు. అబ్బాయిలు ఎవరైనా అమ్మాయిల్ని ఏడిపిస్తే, వాళ్ళతో తప్పుగా ప్రవర్తిస్తే కచ్చితంగా శిక్షించాలని.. చట్టం దృష్టిలో అందరూ సమానమే అంటూ జ్యోతి చెప్పారు. ఎంత పెద్దవాళ్లను అయినా సరే వదలకూడదన్నారు. కానీ కొంతమంది అమ్మాయిలు చట్టాలను ఉపయోగించుకొని ఎదిగే వాళ్లను తొక్కేస్తారని అన్నారు. కెరియర్ మీద కొడతారని అన్నారు.లైఫ్ లో చాలా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరీర్ ని దెబ్బ కొట్టడానికి కొంత మంది అమ్మాయిలు చూస్తున్నారని.. వాళ్లను కూడా కఠినంగా శిక్షించాలన్నారు.


మనం ఎదగడానికి మరొకరిని పడగొట్టడం చాలా అన్యాయమని అన్నారు. అయితే ఈ విషయంపై జ్యోతిరాజ్ రియాక్ట్ అవ్వడాన్ని జానీ మాస్టర్ ఫ్యాన్స్ హర్షిస్తున్నారు. కనీసం దోషి అని ముద్ర వేయకుండా నిజాలు తెలుసుకోవాలని కోరడం చాలా ఆనందంగా ఉందన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news jyothi-rai johnmaster

Related Articles