BRS: రేవంత్ అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్‌కు ఫిర్యాదు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అనుచిత వ్యాఖ్యలు చేశారు.


Published Aug 02, 2024 07:16:04 AM
postImages/2024-08-02/1722600712_notice.PNG

న్యూస్ లైన్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలను అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బీఆర్‌ఎస్ నేతలు ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ క్షమపాణలు చెప్పాలని వారు పెద్ద ఎత్తున్న ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మహిళా ఎమ్మెల్యేలనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అసెంబ్లీ స్పీకర్‌కు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. స్పికర్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను బీఆర్ఎస్ పార్టీ సమర్పించింది. 

newsline-whatsapp-channel
Tags : telangana mla brs cm-revanth-reddy speaker

Related Articles