ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి పోస్టర్ ను ఆవిష్కరించారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఆలయాల్లో సుధీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న అర్చక , ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్చక , ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు దేవదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అర్చక ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటుచేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండాసురేఖ అర్చక ఉద్యోగుల సంక్షేమ నిధి పోస్టర్ ను ఆవిష్కరించారు. అదే విధంగా గ్రాట్యుటీని రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ ఉత్తర్వ్యూలు జారీ అయ్యాయి.
సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని సహాయ కమిషనర్ స్థాయి వరకు గల దేవాలయాల్లో పనిచేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. సడన్ గా చనిపోతే లాస్ట్ సంస్కారాల ఖర్చుల నిమిత్తం ఇచ్చే రూ.20 వేలకు రూ.30 వేలకు ప్రభుత్వం పెంచింది.
దేవాదాయ శాఖపరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అర్చకులకు మరణానంతరం లేదా పదవీ విరమణ తరువాత చెల్లించే గ్రాట్యుటీ మొత్తాన్ని రూ. 4లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచుతూప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది అర్చకులు, ఉద్యోగులకు ఆర్ధిక భద్రతను , భవిష్యత్తుకు భరోసా ను కల్పిస్తుంది.