badrachalam: రామచంద్రా...నీ గుడిలో అన్యమత ప్రచారమా !

దేవస్థానం నుంచి హక్కులు పొందిన వ్యాపారి నిర్వహిస్తున్న శేష వస్త్రాల షాప్ లో అన్యమత ప్రచార సంచిలో పెట్టి వస్త్రాలు అమ్ముతున్నాడు


Published Jun 02, 2025 05:54:00 PM
postImages/2025-06-02/1748867199_images.jpg

న్యూస్ లైన్, డెస్క్ : దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. స్వామివారి శేష వస్త్రాలు కొనుగోలు చేస్తే స్వామి కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం . దేవస్థానం నుంచి హక్కులు పొందిన వ్యాపారి నిర్వహిస్తున్న శేష వస్త్రాల షాప్ లో అన్యమత ప్రచార సంచిలో పెట్టి వస్త్రాలు అమ్ముతున్నాడు. ఈ విషయాన్ని భక్తులు గమనించడంతో భక్తులు అందోళనకు గురయ్యారు.


ఈ విషయం అధికారులకు తెలీకపోవడంతో ఒక్కసారిగా ఈ విషయంపై  ఉలిక్కిపడ్డారు. స్వామి వారి శేష వస్త్రాల ను అమ్మడానికి గాను ఓ వ్యాపారి సంవత్సరానికి రూ.50,000 ఆలయానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఆ దుకాణంపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్యమత ప్రచార సంచులను ఏదో ఒక రూపంలో భక్తులకు అంటగట్టి అపచారం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.


భక్తులు షాప్ ఓనర్ ను ప్రశ్నించగా ...వారి నుంచి సరైన సమాధానం రాలేదని తెలిపారు భక్తులు. అయితే కవర్లు లేక ఆ కవర్ లో ఇస్తున్నాడేమో అని ప్రశ్నించగా ...అది కూడా కాదని కొత్త కవర్స్ అని తెలిపారు.సమాచారం తెలుసుకున్న భద్రాచల ఆలయ సిబ్బంది దుకాణాన్ని పరిశీలించారు. అక్కడ కొన్ని సంచులపై అన్యమత ప్రచార స్లోగన్‌ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని అక్కడి నుంచి తొలగించారు. తమ వద్ద ఉన్న అన్ని సంచులపై దేవస్థానం చిత్రాలే ఉంటాయని, ఆ సంచులపై అన్యమత స్లోగన్‌ ఉన్నట్లు తాము చూడలేదని, అవి ఎలా వచ్చాయో కూడా తనకు తెలియదని దుకాణ నిర్వహకులు చెబుతున్నారు. దుకాణదారులకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sriram

Related Articles