ఈ ఈవెంట్ కు బాలీవుడ్ నుంచి చాలా మంది అతిథులు రాబోతున్నట్లు కూడా తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ -2025 పోటీలు ఆఖరి దశకు చేరుకున్నయి, మరో కొన్ని గంటల్లో ప్రపంచ సుందరి 2025 ఎవరో తేలిపోతుంది. మిస్ వరల్డ్ పోటీల గ్రాండ్ ఫైనల్ కోసంహైదరాబాద్ హైటెక్స్లో భారీ ఏర్పాట్లు జరిగాయి. ఫైనల్ నిర్వహణకు సర్వం సిద్ధం అయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 6-30గంటలకు కార్యక్రమం ప్రారంభమై 9-20గంటలకు ముగియనుందని తెలుస్తుంది.. దాదాపు 3500 మంది కూర్చునేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ నుంచి చాలా మంది అతిథులు రాబోతున్నట్లు కూడా తెలిపారు.
ఈ గ్రాండ్ ఫినాలే 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ కానుండగా,ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ఈ సారి మిస్వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. దాదాపు 110 దేశాల నుంచి బ్యూటీస్ వచ్చారు. గ్రాండ్ ఫినాలేకు 40 మంది కంటెస్టెంట్లు ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ ఛైర్పర్సన్ జూలియా మోర్లే ఈ ప్రతిష్టాత్మక జ్యూరీకి నేతృత్వం వహిస్తుండగా, జ్యూరీ సభ్యులుగా.. బాలీవుడ్ నటుడు సోనూ సూద్, ప్రముఖ ఆంత్రప్రెన్యూర్ సుధా రెడ్డి, 2014 మిస్ ఇంగ్లాండ్ కెరినా టిర్రెల్ వ్యవహరించనున్నారు. వీరులో సోనూ సూద్ మిస్వరల్డ్ హ్యుమానిటేరియన్ అవార్డును అందజేయనున్నారు.
బాలీవుడ్ స్టార్స్ జాక్వెలిన్ , ఇషాన్ ఖట్టర్ వారి పర్ఫామెన్స్ తో ఆకట్టుకోనున్నాడు. మానుషి చిల్లర్ (2017 మిస్ వరల్డ్), స్టెఫానీ డెల్ (2016 మిస్ వరల్డ్) ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నారు. ప్రెజెంటర్గా సచిన్ కుంభార్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.