నలుగురి మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది మరొకరి కోసం నదిలో గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదం జరిగింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బాసర సరస్వతీ మాత దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రమాదవశాత్తు గోదావరి నదిలో మునిగి నలుగురు వ్యక్తులు చనిపోయారు. స్నానం కోసం నదిలోకి దిగిన ఐదుగురు గల్లంతయ్యారు . నలుగురి మృతదేహాలను వెలికి తీసిన సహాయక సిబ్బంది మరొకరి కోసం నదిలో గాలిస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదం జరిగింది.
నదిలో స్నానానికి దిగిన భక్తులు గల్లంతవడం చూసి అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టిన పోలీసులు గజఈతగాళ్లతో రెస్క్యూ చేపట్టారు. గజ ఈతగాళ్లు నలుగురు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. గల్లంతైన మరొకరి కోసం ఇంకా గాలిస్తున్నారు. కాగా మృతులంతా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ వాసులని అందరూ కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.