CBN: సీఎం చంద్రబాబుతో స్పీకర్ గడ్డం ప్రసాద్ భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆదివారం తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ అయ్యారు.


Published Aug 11, 2024 10:14:45 PM
postImages/2024-08-11/1723394685_speaker.PNG

న్యూస్ లైన్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఆదివారం తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ భేటీ అయ్యారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయన కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని సీఎం చంద్రబాబు‌ను స్పీకర్ కోరారు. అలాగే విజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపై స్పీకర్ సీఎం చంద్రబాబుతో దాదాపు 2 గంటల వరుకు చర్చ జరిపారు. ఇక వివిధ అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లడించారు.

newsline-whatsapp-channel
Tags : telangana chandrababu andhrapradesh speaker

Related Articles