gold: మళ్లీ పెరిగిన బంగారం ధర...ఇప్పుడు తులం ఎంతంటే ?

ఇప్పుడు 24 క్యారట్లు బంగారం 76869 రూపాయిలు నమోదయ్యింది. ఆదివారం కిలో వెండి ధర రూ.91,130 ఉండగా, సోమవారం నాటికి రూ.100 పెరిగి రూ.91,230కు చేరుకుంది.


Published Sep 23, 2024 10:57:00 AM
postImages/2024-09-23/1727069265_Goldprice20171211205332.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం , వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం 10 గ్రాముల బంగారం 76,649 రూపాయిలు ఉండేది. సోమవారం ఉదయం పది గంటలకు మరో 220 రూపాయిలు పెరిగింది. ఇప్పుడు 24 క్యారట్లు బంగారం 76869 రూపాయిలు నమోదయ్యింది. ఆదివారం కిలో వెండి ధర రూ.91,130 ఉండగా, సోమవారం నాటికి రూ.100 పెరిగి రూ.91,230కు చేరుకుంది.


*హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.76,869గా ఉంది. కిలో వెండి ధర రూ.91,230గా ఉంది. గ్రాము ధర 7600 గా నడుస్తుంది. అదే 22 క్యార్టలు అయితే 69820 గా మార్కెట్ ధర నడుస్తుంది అంటే గ్రాము 6900 నడుస్తుంది.


*విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.76,869గా ఉంది. కిలో వెండి ధర రూ.91,230గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలన్నింటిను ఇదే బంగారం ధర నడుస్తుంది.


*విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.76,869గా ఉంది. కిలో వెండి ధర రూ.91,230గా ఉంది. బంగారం తో పాటు వెండి కూడా ఈక్వల్ గా పెరుగుతుంది.


ఇక వెండి ధర 91230 గా నడుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ అంచనాలు చూస్తే వెండి , బంగారం ధర మరింత పెరిగే అవకాశముందంటున్నారు ఎక్స్ పర్ట్స్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business gold goldrates silver-rate stock-market

Related Articles