10రూ"పారితోషకంతో మొదలైన ఆమె..కోట్ల ఆస్తులకు అధిపతి.!

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, వంటి హీరోల కాలంలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది  ఈ నటి. కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె టాప్


Published Sep 24, 2024 06:35:00 PM
postImages/2024-09-24/1727181476_JAYAPRABHA.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, వంటి హీరోల కాలంలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది  ఈ నటి. కేవలం 14 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అలాంటి ఈమె కేవలం 10 రూపాయల పారితోషకంతో మాత్రమే తన కెరియర్ మొదలుపెట్టింది. ప్రస్తుతం కోట్లాది రూపాయలు సంపాదించుకొని  తనకు ఎదురు లేదు అనిపించుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే  సీనియర్ నటి జయప్రద.

ఈమె కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, హిందీ, మలయాళ, భాషల్లో కూడా తనకు ఎదురు లేదు అనిపించుకుంది. కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా అద్భుతంగా రాణిస్తోంది. అయితే ఈమె 14 ఏళ్ల వయసులోనే ఉన్నప్పుడే ఓ నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఏం ప్రభాకర్ రెడ్డి చూసి ఆమెను ఇండస్ట్రీలోకి పరిచయం చేశాడు.  ఇక 1976 లో వచ్చినటువంటి భూమి కోసం అనే చిత్రంలో కేవలం మూడు నిమిషాల పాత్ర చేసింది.

అలా మొదలైన ఆమె ప్రస్థానం 2005 వరకు ఎదురులేకుండా సాగింది. అయితే జయప్రద తన తొలి పారితోషికం కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుందట. అలా పది రూపాయలతో మొదలైన ఆమె  ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషకం తీసుకునే నటిగా ఎదిగింది. తక్కువ కాలంలోనే ఎక్కువ సంపాదించింది. అలాంటి ఈమె కేవలం హీరోయిన్ గానే కాకుండా నిర్మాతగా, రాజకీయ, నాయకురాలిగా, కూడా సక్సెస్ అవుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu sr-ntr krishna anr jayapradha m-prabhakareddy

Related Articles