Actress: నేషనల్ క్రష్‌‌కు గాయం

ఈ బ్యూటీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ‌విషయాన్ని స్వయంగా ఆమే సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 


Published Sep 09, 2024 06:31:30 PM
postImages/2024-09-09/1725886890_rashm.PNG

న్యూస్ లైన్ సినిమా: టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాక మంచి సినిమాలు చేస్తూ నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న‌‌ దూసుకుపోతుంది. పుష్ప సినిమాతో వరల్డ్ వైడ్‌గా రష్మిక గుర్తింపు తెచ్చుకుంది. చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతుండడంతో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇక రష్మిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను సంపాదించుకుంది. అయితే ఈ బ్యూటీ తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ ‌విషయాన్ని స్వయంగా ఆమే సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

‘‘హే అబ్బాయిలు మీరు ఎలా ఉన్నారు? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి లేదా పబ్లిక్‌గా కనిపించినప్పటి నుండి కొంత సమయం గడిచిందని నాకు తెలుసు. గత నెలలో నేను పెద్దగా యాక్టివ్‌గా ఉండకపోవడానికి కారణం, నాకు చిన్న ప్రమాదం జరిగింది. నేను కోలుకుంటున్నాను.. డాక్టర్లు చెప్పినట్లుగా ఇంట్లోనే ఉన్నాను. నేను ఇప్పుడు మెరుగ్గా ఉన్నాను తలదించుకోవడం కోసం మాత్రమే - నేను చాలా చురుకుగా ఉండే దశలో ఉన్నాను, కాబట్టి నా కార్యకలాపాలతో ఉత్తమంగా వ్యవహరిస్తున్నాను. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. జీవితం చాలా చిన్నది, మనకు రేపు ఉందో లేదో తెలియదు కాబట్టి ప్రతిరోజూ ఆనందాన్ని ఎంచుకోండి’’ అంటూ రష్మిక తన సోషల్ మీడియా పోస్టులో రాసుకోచ్చింది.  

newsline-whatsapp-channel
Tags : telangana tollywood movie-news pushpa2 social-media rashmika-mandanna

Related Articles