Chiranjeevi:ఎందరితోనో నటించా.. నాకు సుఖాన్ని ఇచ్చిన హీరోయిన్ ఆవిడే.?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో  హీరో చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు.. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా  ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన చిరంజీవి అంచలంచలుగా ఎదిగి ఇండస్ట్రీకి మెగాస్టార్


Published Sep 13, 2024 08:44:55 AM
postImages/2024-09-13/1726234454_chiru.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో  హీరో చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు.. 1978లో ప్రాణం ఖరీదు అనే సినిమా ద్వారా  ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన చిరంజీవి అంచలంచలుగా ఎదిగి ఇండస్ట్రీకి మెగాస్టార్ గా మారారు. ప్రస్తుతం ఈయన నటవారసత్వం అందిపుచ్చుకొని ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అలాంటి చిరంజీవి ఇప్పటికే   150కి పైగా చిత్రాల్లో నటించి  తనకు ఎదురులేరు అనిపించుకుంటున్నారు.. అయితే ఈయన చేసిన చాలా సినిమాల్లో  దాదాపుగా ఎంతో మంది హీరోయిన్స్ తో జత కట్టారు. ఆయన తరం హీరోయిన్స్ నుంచి ఇప్పటి తరం హీరోయిన్లు కూడా చిరంజీవితో నటించారని చెప్పవచ్చు.

ఆయన ఎంతోమందితో నటించినా ఎవరో ఒకరు అయితే తనకు నచ్చిన హీరోయిన్ అయితే ఉంటారు. చిరంజీవిని అత్యంత ఆనందపరిచిన నచ్చిన హీరోయిన్ ఎవరనేది కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని  తెలియజేశారు. అయితే ఇంటర్వ్యూలో మీకు ఆల్ టైం ఫేవరేట్ హీరోయిన్ ఎవరని యాంకర్  ప్రశ్నించగా..ఒక్కో హీరోయిన్ లో ఒక్కో క్వాలిటీ ఉంటుంది. ఎవరు ఎక్కువ ఇష్టమని చెప్పలేం. కానీ హీరోయిన్ రాధా డాన్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. శ్రీదేవి పర్సనాలిటీ పరంగా చాలా గొప్పది. ఇక సుమలత హోమ్లీ పాత్రలకు పెట్టింది పేరు.

ఇక సుహాసిని మరో కోణంలో గొప్ప. ఒక్కో హీరోయిన్ ఒక్కో క్వాలిటీ ఉంటుంది. ఇక ఇందులో  రాధిక కామెడీ, మాస్, క్లాస్, ఎమోషన్స్, ఇలా ఏ పాత్రలో అయినా  అద్భుతంగా నటించగలదు. అందుకే నాకు ఆమె ఎంతో ఇష్టమైన హీరోయిన్ అని చిరంజీవి చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్ లో అనేక చిత్రాలు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దొంగ మొగుడు, న్యాయం కావాలి, పట్నం వచ్చిన ప్రతివ్రతలు, అభిలాష, వంటి చిత్రాలు ఉన్నాయి. అలాంటి చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu viral-news radhika vishwambhara pranamkharidu donga-mogudu

Related Articles